ఏపీలో 100కి దిగువన కరోనా రోజువారీ కేసులు

  • గత 24 గంటల్లో 21,211 కరోనా పరీక్షలు
  • 75 మందికి కరోనా పాజిటివ్
  • విశాఖ జిల్లాలో 17 కొత్త కేసులు
  • గుంటూరు జిల్లాలో ఒకరి మృతి
  • ఇంకా 1,517 మందికి చికిత్స
ఏపీలో ఇటీవల కాలంలో 100కి దిగువన కరోనా రోజువారీ కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం అని చెప్పాలి. గడచిన 24 గంటల్లో 21,211 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 75 కొత్త కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో 17, చిత్తూరు జిల్లాలో 13, గుంటూరు జిల్లాలో 10 కేసులు వెల్లడయ్యాయి. కర్నూలు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. మిగిలిన జిల్లాల్లో సింగిల్ డిజిట్ లో కొత్త కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 154 మంది కరోనా నుంచి కోలుకోగా, గుంటూరు జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,75,879 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,59,882 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 1,517 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 14,480కి పెరిగింది.

Andhra Pradesh
Corona Virus
Daily Cases
Today Cases

More Telugu News